న్యాయమూర్తుల నియామకాలు.. తెరపైకి మళ్లీ స్థానికత అంశం
- హైకోర్టు జడ్జీల నియామకాల్లో స్థానికులకే అవకాశం ఇవ్వాలని డిమాండ్
- హైకోర్టు వద్ద ధర్నా చేపట్టిన తెలంగాణ న్యాయవాదులు
- స్థానికేతరుల పేర్లను పరిశీలించవద్దంటూ ఏకగ్రీవ తీర్మానం
- ఏపీకి చెందిన న్యాయవాదుల పేర్లు పరిశీలనలో ఉన్నాయని ఆందోళన
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో స్థానిక న్యాయవాదులకే ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ (THCAA) నిరసన చేపట్టింది. ఇందులో భాగంగా బుధవారం హైకోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు ధర్నా నిర్వహించారు. న్యాయమూర్తుల పోస్టుల కోసం స్థానికేతరుల పేర్లను పరిశీలించడాన్ని నిరసిస్తూ ఈ ఆందోళన చేపట్టారు.
గత నెల 15న జరిగిన అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు న్యాయవాదులు వెల్లడించారు. అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్. సురేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, భవిష్యత్తులో చేపట్టే న్యాయమూర్తుల నియామకాలకు కేవలం తెలంగాణకు చెందిన వారి పేర్లనే సిఫార్సు చేయాలని సుప్రీంకోర్టు, హైకోర్టు కొలీజియంలను కోరారు. ఈ అంశంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, గవర్నర్ వంటి రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారికి వినతిపత్రాలు సమర్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
న్యాయమూర్తుల నియామకం కోసం పరిశీలిస్తున్న జాబితాలో ఆంధ్రప్రదేశ్కు చెందిన న్యాయవాదుల పేర్లు ఉన్నాయనే సమాచారంతో ఈ నిరసన వెల్లువెత్తింది. సామాజిక న్యాయం పాటించాలన్నా, ప్రాంతీయ ప్రాతినిధ్యం కల్పించాలన్నా తెలంగాణ మూలాలు ఉన్నవారినే న్యాయమూర్తులుగా నియమించాలని వారు వాదిస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఈ డిమాండ్ పలుమార్లు తెరపైకి వస్తున్న విషయం తెలిసిందే.
గత నెల 15న జరిగిన అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు న్యాయవాదులు వెల్లడించారు. అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్. సురేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, భవిష్యత్తులో చేపట్టే న్యాయమూర్తుల నియామకాలకు కేవలం తెలంగాణకు చెందిన వారి పేర్లనే సిఫార్సు చేయాలని సుప్రీంకోర్టు, హైకోర్టు కొలీజియంలను కోరారు. ఈ అంశంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, గవర్నర్ వంటి రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారికి వినతిపత్రాలు సమర్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
న్యాయమూర్తుల నియామకం కోసం పరిశీలిస్తున్న జాబితాలో ఆంధ్రప్రదేశ్కు చెందిన న్యాయవాదుల పేర్లు ఉన్నాయనే సమాచారంతో ఈ నిరసన వెల్లువెత్తింది. సామాజిక న్యాయం పాటించాలన్నా, ప్రాంతీయ ప్రాతినిధ్యం కల్పించాలన్నా తెలంగాణ మూలాలు ఉన్నవారినే న్యాయమూర్తులుగా నియమించాలని వారు వాదిస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఈ డిమాండ్ పలుమార్లు తెరపైకి వస్తున్న విషయం తెలిసిందే.